మహిళను కాటేసిన ఎలుక
– రూ. 60 వేల పరిహారం చెల్లింపుకు ఆదేశం
– ఐదేళ్ల తరువాత వినియోదారుల కమీషన్ తీర్పు
దర్శిని డెస్క్: సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లిన ఓ మహిళ ఎలుక కాటుకు గురైంది. ఆసుపత్రి ఖర్చులతో పాటు నష్టం, మానసిక వేదనను కలిపి మొత్తం రూ. 6 లోల పరిహారం చెల్లించాలని బాధిత మహిళ వినియోగదారుల కమీషన్ను ఆశ్రయించింది. ఇదంతా జరిగి ఐదేళ్లు గడుస్తోంది. కేసు పూర్వపరాలను పరిశీలించిన వినియోగదారుల కమీషన్ తాజాగా ఎలుక కాటుకు గురైన ఓ మహిళకు రూ.60 వేలు పరిహరం చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్.. థియేటర్ యాజమాన్యాన్ని ఆదేశించింది. వైద్య బిల్లు రూ.2 వేలతో పాటు కోర్టు ఖర్చులకు అదనంగా రూ.5 వేలు ఇవ్వాలని పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని గువాహటి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 2018 అక్టోబరు 20న అనిత అనే మహిళ జిల్లాలో గలెేరియా థియేటర్లో సినిమా చూసేందుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. సినిమా ఇంటర్వెల్ సమయంలో తన కాలిని ఓ ఎలుక కొరికింది. వెంటనే ఆమె సినిమా హాలు నుంచి బయటకు పరిగెత్తారు. (ఇంకా ఉంది కిందకి చూడండి…)
అనంతరం జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. తనకు జరిగిన నష్టం, మానసిక వేదనుకుగాను రూ.6 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ప్రేక్షకులకు సరైన సేవలను అందించటంలో హాలు యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని భావించిన వినియోగదారుల కమిషన్.. బాధితురాలికి రూ. 60వేల పరిహారం చెల్లించాలంటూ ఏప్రిల్ 25న తీర్పు వెలువరించింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వార్తను చదివిన కొందరు వినియోగదారులు ఇలాంటి చిన్న చిన్న విషయాలపై కూడ చైతన్యం కావాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…
మిస్ అయిన మోబైల్ ట్రేస్ అయ్యింది
– వినియోగదారుని అందించిన పోలీసులు
– సీఈఐఆర్ను సద్వినియోగం చేసుకోవాలి
– కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి
https://dharshininews.com/16965

