ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్‌నే చంపేశాడు..!

క్రైం జాతీయం తెలంగాణ హైదరాబాద్

ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్‌నే చంపేశాడు..!
– ఉన్మాది దాడిలో మరో నలుగురికి గాయాలు
– కేరళలో చోటు చేసుకున్న దారుణం
– సుమోటోగా తీసుకున్న హుమన్ రైట్స్ కమీషన్
– తీవ్ర సంచలనమైన ఘటన
దర్శిని డెస్క్‌: వైద్యం కోసం వచ్చి డాక్టర్‌ను హత్య చేశాడు ఓ నేరస్తుడు. తీవ్ర సంచలనం రేపిన ఈ దారుణ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొట్టరక్కర పీఎస్‌ పరిధిలోని పూయపల్లికి చెందిన సందీప్ అనే వ్యక్తిని మద్యం మత్తులో కుటుంబసభ్యులతో గొడవ పడ్డ కేసులో పోలీస్టేషన్‌కు తీసుకవచ్చారు. అంతకుమందే సందీప్‌ కాలికి గాయం కావడంతో వందనాదాస్‌ అనే మహిళ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. కాలికి బ్యాండేజ్‌ కడుతున్న సమయంలో సడెన్‌గా వందనాదాస్‌పై కత్తితో దాడి చేశాడు సందీప్‌. ఈ దాడిలో వందనాదాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. ట్రీట్‌మెంట్‌ కోసం త్రివేండ్రం తరలించగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. ఉన్మాది సందీప్‌ దాడిలో మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ కేసులో నిందితుడైన సందీప్ నెడుంపన యూపీ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. (ఇంకా వుంది..)

మరోవైపు కొట్టారక్కర తాలూకా ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిని కత్తితో పొడిచి చంపిన కేసును మానవ హక్కుల సంఘం సుమోటోగా తీసుకుంది. దీంతో హైకోర్టు ద్వారా ప్రత్యేక విచారణ జరిగింది. వేసవి సెలవులు కావడంతో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక సిట్టింగ్‌ను ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు దేవన్ రామచంద్రన్, కౌసర్ ఎడప్పగత్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మధ్యాహ్నం 1.45 గంటలకు సిట్టింగ్‌ను నిర్వహించనుంది. ఏడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు వీకే బీనాకుమారి కొల్లం జిల్లా పోలీసు చీఫ్‌ను ఆదేశించారు. అదేవిధంగా ఉన్మాది దాడిలో మృతి చెందిన వందనాదాస్‌ మృతదేహానికి ఆస్పత్రిలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ , సీఎం విజయన్‌ నివాళి అర్పించారు. మరోవైపు వందనాదాస్‌ హత్యకు నిరసనగా కేరళలో ఆందోళనలు మిన్నంటాయి. వైద్యవిద్యార్ధులు క్లాస్‌లను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో వైద్య విద్యార్థులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇంటర్న్‌లు, హౌస్ సర్జన్లకు భద్రత కల్పించాలి. ఆరోగ్య కార్యకర్తలకు కల్పిస్తున్న భద్రతను ఆసుపత్రిలో పనిచేస్తున్న విద్యార్థులకు కూడా కల్పించాలని వినతిపత్రంలో కోరారు.

ఇది కూడా చదవండి…

ఐపీఎస్‌ అధికారికే మస్కా..!
– దోశ బిల్లు కట్టించే ప్రయత్నం
– వైరల్ అయిన సంఘటన
https://dharshininews.com/17059