9న కులవృత్తిదారులకు ఆర్థికసాయం..!

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

9న కులవృత్తిదారులకు ఆర్థికసాయం..!
– ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ. లక్ష
– ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులకు అవకాశం
– విధివిధానాలను ప్రకటించనున్న సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని కులవృత్తిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు సర్కారు ముందడుగు వేసింది. నాయీబ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, కుమ్మరి, మేదరి, రజక, పూసల వర్గాలతో పాటు.. మరిన్ని కులాలను గుర్తించిన ఉపసంఘాల అర్హులకు ఆర్థిక సహాయంపై ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించనుంది. ప్రతి నియోజకవర్గంలో 1200 నుంచి 1500 మందికి లబ్ధి చేకూర్చేలా కసరత్తు చేస్తోంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా పూర్తి సబ్సిడీతో రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొలివిడత పథకాన్ని ప్రకటించనుంది. దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సహాయం తదితర విధివిధానాలను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేయనుంది.

ఈ మేరకు సోమవారం సాయంత్రం 4 గంటలకు సమావేశమై, సీఎం సమక్షంలో తుది విధానాలు ప్రకటించనుంది. జూన్‌ 9న ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారీగా చేపట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఎంబీసీ, బీసీ కార్పొరేషన్లకు స్వయం ఉపాధి రుణాల కోసం ప్రభుత్వం రూ.603 కోట్లు కేటాయించింది. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.303 కోట్లు, బీసీ కార్పొరేషన్‌కు రూ. 300 కోట్లు ఉన్నాయి. తాజాగా ప్రకటించిన ఆర్థిక సహాయానికి ఈ నిధుల్ని వినియోగిస్తారో లేక ప్రత్యామ్నాయంగా సర్దుబాటు చేస్తారో తెలియాల్సి ఉంది.

chaithany collage