పట్టుదలతో లక్ష్యాలను సాధించుకోవాలి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

పట్టుదలతో లక్ష్యాలను సాధించుకోవాలి
– ఉత్సహాంగా శాలివాహన విద్యార్థుల వీడ్కోలు సమావేశం
– ఆడిపాడిన కళాశాల విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థులు పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను సాధించుకోవాలని ప్రముఖ వక్తలు భాస్కర యోగి, కన్నెగంటి రమేష్ లు అన్నారు. శనివారం తాండూరు పట్టణం శాలివాహన డిగ్రీ కళాశాల ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు తృతీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పట్టణంలోని తులసీ గార్డెన్ లో నిర్వహించిన వీడ్కోలు సమావేశం ఉత్సహాంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి హాజరై వక్త భాస్కర యోగి, కన్నెగంటి రమేష్ లు మాట్లాడుతూ సమాజంలో మహనీయులుగా ఎదిగిన వారి జీవితాలను ఉదహరిస్తూ విద్యార్థులను చైతన్య పరిచారు. విద్యార్థులు తమ ఉన్నత మైన భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. వాటిని సాధించుకునేందుకు పట్టుదలతో శ్రమించాలన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించి కళాశాలకు, తల్లిదండ్రులకు, అద్యాపకులకు మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. మరోవైపు విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో విద్యార్థులు ఆట పాటలతో ఉత్సహాంగా గడిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ శరత్ చంద్ర, అకాడమిక్ డైరెక్టర్ సిద్ది లింగయ్య, మేనేజ్ మెంట్ సభ్యులు మాణిక్యం, కట్కం వీరేందర్, మాధవరెడ్డి, లక్ష్మారెడ్డి, చైతన్య కళాశాల ప్రిన్సిపల్ సోమనాథ్, అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

పట్నం వారి పెళ్లి సందడి..!
– వైభవంగా మనీషా రెడ్డి నిశ్చితార్థం
– కాబోయే వధూరులకు ఆశీర్వాదాల వెల్లువ
https://dharshininews.com/16923