అయ్యో.. దత్తాత్రేయశ్వరా..!
– స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు
– శక్తిపీఠాల పూజల కోసం అని పుకార్లు
– తాండూరు మండలం జినుగుర్తిలో ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : సమాజంలో దేవుళ్ళ విగ్రహాలకు భద్రత లేకుండా పోయింది. గుళ్ళు కట్టించి ప్రతిష్టించిన దేవాలయాలలో దేవతా మూర్తుల విగ్రహాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జినుగుర్తి గేటు వద్ద ప్రతిష్టించిన దత్తాత్రేయుని విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు అపరించుకుని పోయారు. దత్తాత్రేయుని విగ్రహాన్ని కూడా ఎత్తుకెళ్లిపోయారు. ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం మేరకు… జినుగుర్తి గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ వీరేశం, గ్రామస్తులు కలిసి రెండేళ్ల క్రితం గ్రామ గేటు సమీపంలో పాలరాతి విగ్రహం లో ఉన్న దత్తాత్రేయుని ప్రతిష్టించారు. దాదాపు రూ. 32 వేలు ఖర్చు చేసి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయానికి సమీపంలోనే 32 ఏళ్ల క్రితం ప్రతిష్టించిన నంది విగ్రహంకూడా ఉంది. అయితే.. గురువారం ఉదయం దత్తాత్రేయుని ప్రతిష్టించిన గుడిలో స్వామి విగ్రహం అదృశ్యం అయింది. దత్తాత్రేయుని విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన చోట ఓ చెంబును ఉంచి వెళ్లిపోయారు. దత్తాత్రేయుని విగ్రహానికి బదులు చెంబు ఉంచిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దత్తాత్రేయ స్వామి విగ్రహం అదృశ్యం కావడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శక్తిపీఠం పూజలు.. ఇతర పూజల కోసం విగ్రహాన్ని ఎత్తుకెళ్లినట్లు గ్రామంలో పుకార్లు పుట్టుకొచ్చాయి. మరోవైపు విగ్రహాం అదృశం అయిన విషయం తెలుసుకున్న కరన్ కోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించినట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి….
లిఫ్ట్.. హెల్మెట్.. జైలు..!
– భర్త కొంప ముంచిన పనులు
– భార్య ఫిర్యాదుతో కేసు
– అసలేం జరిగిందంటే..?
https://dharshininews.com/17114

